స్టేజీపైనే స్టార్ డైరెక్టర్‌కు రాఖీ కట్టిన టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్!

by Disha Web Desk 9 |
స్టేజీపైనే స్టార్ డైరెక్టర్‌కు రాఖీ కట్టిన టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రవితేజ.. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కలిసి నటించిన ఈగల్ చిత్రం ఫిబ్రవరి 9 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం నిన్న (ఫిబ్రవరి 4) మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనుపమ వైట్ ఎంబ్రాయిడింగ్ శారీలో హాజరై అక్కడున్నవారందినీ ఆకట్టుకుంది.

అయితే నిన్న ఈ బ్యూటీ అందరిముందే స్టేజీపై చేసిన పనికి అందరూ షాక్ తిన్నారు. స్టేజీపైనే ఈగల్ మూవీ డైరెక్టర్‌ కార్తీక్ ఘట్టమనేని అన్నయ్య అని పిలిచింది. దీంతో హీరో రవితేజ కూడా స్పందించడం విశేషం. ‘అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే పదం ఉపయోగించకూడదు’ అని రవితేజ అనడంతో ఆడియన్స్ అంతా ఒక్కసారిగా నవ్వారు.

దీనికి అనుపమ స్పందించి.. ‘కార్తీక్‌తో నేను నాలుగు చిత్రాలు తీశాను. ఈ దర్శకుడికి నాకు మంచి బాండింగ్ ఉంది. ఎప్పటినుంచో అన్నయ్య అని పిలవడం అలవాటు అయిపోయింది. అని అనుపమ చెబుతుంది. వెంటనే స్టార్ యాంకర్ సుమ రాఖీ తీసుకొచ్చి అనుపమకు ఇచ్చి.. కార్తీక్ కు కట్టాలని చెప్పడంతో ఈ బ్యూటీ స్టేజీపై అందరిముందే కట్టేస్తుంది. అనుపమ.. డైరెక్టర్ కార్తీక్ కు రాఖీ కట్టగానే అక్కడున్నవారంతా షాక్ అవుతారు.

Read More..

క్యాన్సర్ తో బాధపడ్డ తన భార్య ఫోటోను షేర్ చేసిన బాలీవుడ్ స్టార్..!

Next Story

Most Viewed