కుర్రాళ్లకు మత్తెక్కించిన ఆ ముగ్గురు అమ్మాయిలు.. వీడియో వైరల్

by Disha Web Desk 17 |
కుర్రాళ్లకు మత్తెక్కించిన ఆ ముగ్గురు అమ్మాయిలు.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: ప్రముఖ తెలుగు చానెల్ ఈటీవీ లో ప్రస్తుతం ప్రసారమవుతున్న ‘గుండె జారి గల్లంతయ్యిందే’ షో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే హోలీ స్పెషల్ 5 మార్చి రాత్రి 7 గంటలకు #etvteluguలో రాబోయే ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇందులో అందరూ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వగా చివర్లో రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ‘ప్యార్‌లో పడిపోతే పరేషాన్ రా’ అనే పాటకు ముగ్గురు అమ్మాయిలు చేసిన డ్యాన్స్ హద్దులు దాటినట్లు కనిపిస్తోంది.

పూర్తిగా బ్యాక్ ఓపెన్ చేసి నడుము అందాలు, ఎదలను హైలెట్ చేస్తూ చేసిన డ్యాన్స్‌కు కుర్రాళ్లు ఫిదా అయ్యామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రీదేవి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి యాంకర్ రవి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, నరేష్, పల్సర్ బైక్ రమణ అన్నపూర్ణమ్మ, మానస్ నాగులపల్లి, సౌమ్య రావు, అంబటి అర్జున్, వర్ష, భాను తదితరులు నటిస్తున్నారు.



Next Story