ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కిన అమితా బచ్చన్ మనవరాలు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Dishanational2 |
ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కిన అమితా బచ్చన్ మనవరాలు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ బిగ్ బీ మనవరాలు, అభిషేక్ బచ్చన్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ ముద్దుల కూతురు ఆరాధ్య కు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారుతుంది. ఈ చిన్నారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిందంట.

అసలు విషయంలోకి వెళ్లితే..గత కొద్ది రోజుల క్రితం ఎయిర్పోర్టులో ఐశ్వర్యరాయ్‌తో కలిసి ఉన్న ఆరాధ్య ఫొటో వైరల్ గా మారింది. అంతే కాకుండా ఆరాధ్య ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్ లను చూడగానే తన నడక స్టైల్ ను మార్చేసిందని దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలయ్యాయి. దీంతో ఇలా తన కూతుర్ని ట్రోల్ చేయకండి అని అభిషేక్ బచ్చన్ రిక్వెస్ట్ చేశాడు. తమ ఫ్యామిలీపై తప్పుడు వార్తలు రాయకూడదంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా కానీ ఆరాధ్య పై సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ చర్యలు తీసుకోవాలని ఆరాధ్య బచ్చన్ తరఫున ఫ్యామిలీ సభ్యులు కోర్టులో కేసు వేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ ఆమె ఆరోగ్యం గురించి , ఆమె జీవితం గురించి తప్పుడు వార్తలు ప్రచురించింది అయితే ఈ వార్త కాస్త ఇప్పుడు బచ్చన్ ఫ్యామిలీకి చేరింది.దీంతో ఆ ఫేక్ న్యూస్ పైనే మైనర్ ఆరాధ్య ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Next Story