మరోసారి జత కట్టనున్న బాలీవుడ్ క్యూట్ కపుల్స్?

by Disha Web Desk 7 |
మరోసారి జత కట్టనున్న బాలీవుడ్ క్యూట్ కపుల్స్?
X

దిశ, సినిమా: ఇటీవలే దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా గురించి పరిచయం అక్కర్లేదు. రీల్ లైఫ్‌లో ఈ జంట పలుసార్లు కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి సినిమా చేయనున్నారు. వెండితెర మీద కమర్షియల్ కాంబినేషన్స్‌ సెట్ చేయటంలో కరణ్ జోహార్‌కు పెట్టింది పేరు. దీంతో ఇప్పుడు ఏ కాంబినేషన్‌‌లో సినిమా చేస్తే వర్కౌట్ అవుతుందో గమనించిన ఆయన.. ఈ జంటను రంగంలోకి దించుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టారు కరణ్. దీని గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.



Next Story

Most Viewed