నా మనోభావాలను గాయపరిచిన అడ్వకేట్లందరిపై కేసు పెట్టబోతున్న: ఆర్‌జీవి

by Disha Web Desk 7 |
నా మనోభావాలను గాయపరిచిన అడ్వకేట్లందరిపై కేసు పెట్టబోతున్న: ఆర్‌జీవి
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ వాస్తవ సంఘటనలపై తన దైన శైలిలో స్పందిస్తుంటారు. ఇదిలా ఉంటే.. రామ్ గోపాల్ వర్మ తాజాగా తనను కించపరుస్తూ తన మనోభావాలను గాయపరచిన వారిపై కేసు పెడతానని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అసలు విషయం ఏంటంటే..

ఇటీవలె వర్మ గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శటీలో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొ్న్నారు. ఈ కార్యక్రమంలో ఆయన గెస్ట్ లెక్షర్ ఇస్తూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో ఆయన దైన శైలిలో మాట్లడేశారు. అయితే ఆ వ్యాఖ్యలు వైరల్ కావడమే కాకుండా వివాదస్పదంగా మారాయి. దీంతో వర్మను ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా పిలిచినందుకు టీడీపీ మహిళా వర్గం ఇప్పటికే వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్‌పై దుమ్మెత్తిపోసింది. ఈ కార్యక్రమంలో వర్మ మహిళలను కించపరిచేలా మాట్లాడారు అని మండిపడ్డారు. ఈ మేరకు అతనిపై పెదకాకాని సీఐకి ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై కేసు పెట్టి ఆర్జీవీపై తగిన చర్యలు తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు.

అయితే.. మహిళా న్యాయవాదుల డిమాండ్‌పై తాజాగా వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందిచారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాను మాట్లాడిన స్పీచ్‌కు సంబంధించిన మొత్తం కాపీని గూగుల్ డాక్యుమెంట్‌లో సేవ్ చేసి ‘‘నన్ను కించపరుస్తూ నా మనోభావాలను గాయపరిచిన ఈ అడ్వకేట్లందరి మీద కేసు పెట్టబోతున్న’’ అంటూ ఓ బాంబు పేల్చారు వర్మ. మరి ఈ గొడవ ఇంకెంత దూరం వెళుతుందో వేచి చూడాల్సి ఉంది.

Also Read...

‘నాటు నాటు’ పాటకు తోలు బొమ్మ స్టెప్పులు.. చూస్తే వావ్ అనాల్సిందే: ఆనంద్ మహీంద్రా ట్వీట్


Next Story

Most Viewed