ఇండియాలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల మార్క్‌ను దాటిన చిత్రంగా గదర్ 2

by Disha Web Desk 12 |
ఇండియాలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల మార్క్‌ను దాటిన చిత్రంగా గదర్ 2
X

దిశ, వెబ్‌డెస్క్: సన్నీ డియోల్ హీరోగా, అమీషా పటేల్ హీరోయిన్‌గా నటించిన కమర్షియల్ బ్లాక్ బస్టర్ గదర్ 2 దేశీయ బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా రూ.500 కోట్ల మార్కును దాటిన హిందీ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారింది. దీంతో కేవలం 24 రోజుల్లోనే రూ. 500 కోట్లను కొల్లగొట్టింది. దీంతో గదర్ 2 షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్, అలాగే రాజమౌళి బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది. పఠాన్ 500 కోట్ల రూపాయల మార్కును అధిగమించడానికి 28 రోజులు పట్టగా, బాహుబలి 2 విడుదలైన 34 రోజుల్లోనే అదే చేసింది. 'గదర్ 2' చిత్రం ఆదివారం నాటికి దేశీయ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 501.87 కోట్లు వసూలు చేసింది. గదర్ 2 మొదటి వారంలో రూ.284.63 కోట్లు, రెండో వారంలో రూ.134.47 కోట్లు, మూడో వారంలో రూ.63.35 కోట్లు వసూలు చేసింది.

Read More: Bigg Boss 7 ఓటింగ్‌పై నమ్మకం కలిగించేందుకే.. ఈ కొత్త రూల్స్ తెర పైకి తెచ్చారా.. ప్రేక్షకులు నమ్ముతారా?

Next Story

Most Viewed