'జీ2' అంచనాలకు మించి ఉంటుంది: ప్రీ విజన్ లాంచ్‌లో అడివి శేష్

by Dishanational4 |
జీ2 అంచనాలకు మించి ఉంటుంది: ప్రీ విజన్ లాంచ్‌లో అడివి శేష్
X

దిశ, సినిమా: అడివి శేష్ నటిస్తున్న తదుపరి ప్రాజెక్ట్‌ 'జీ2'. 'గూఢచారి' సీక్వెల్‌గా వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్న చిత్రాన్ని.. టీ.జీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే మూవీకి సంబంధించి 'ప్రీ విజన్' తాజాగా లాంచ్ చేశారు మేకర్స్. ఇండియా నుంచి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్లే గూఢచారి (అడవి శేష్)చివరి విజువల్స్ చూపించడంతోపాటు హీరో ఫస్ట్ లుక్‌ కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అడవి శేష్.. 'జీ2 ని ఒక ఫ్రాంచైజ్‌గా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయబోతున్నాం. త్వరలోనే ఇది ఆల్ ఇండియా ఫ్రాంచైజ్‌గా మారబోతోంది. ఐదు దేశాల్లో షూట్ చేయబోతున్న చిత్రం 2024లో రాక్స్ ది బాక్స్ ఆఫీస్' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుందన్న దర్శక నిర్మాతలు కొత్త కంటెంట్‌తో వస్తున్న ఈ విజువల్ వండర్ ప్రేక్షకులకు సరికొత్త అనూభూతినిస్తుందన్నారు.

READ MORE

పొలిటికల్ రీ ఎంట్రీపై మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్..!


Next Story

Most Viewed