సూర్య ఫాన్స్ అత్యుత్సాహం.. థియేటర్‌లో చెలరేగిన మంటలు

by Disha Web Desk 2 |
సూర్య ఫాన్స్ అత్యుత్సాహం.. థియేటర్‌లో చెలరేగిన మంటలు
X

దిశ, సినిమా : ఇటీవల విడుదలైన కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.ఈ సినిమా క్లైమాక్స్‌లో ఐదు నిమిషాల అతిథి పాత్రలో కనిపించిన సూర్య పర్ఫార్మెన్స్ ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. తన నటనతో సినిమా లెవెల్‌ను మార్చేయగా.. ఇక సూర్య అభిమానుల ఆనందానికి హద్దులు లేవనే చెప్పొచ్చు. అయితే ఈ అత్యుత్సాహమే ప్రస్తుతం అనర్థానికి దారితీసింది. ఓ థియేటర్ స్క్రీన్ మంటల్లో బూడిదయ్యేలా చేసింది. వివరాల ప్రకారం పుదుచ్చేరిలోని ఒక థియేటర్‌లో 'విక్రమ్' సినిమా ప్రదర్శితమవుతుండగా.. క్లైమాక్స్ చివరన సూర్య కనిపించగానే అభిమానులు సంతోషంతో థియేటర్‌లోనే టపాకాయలు పేల్చారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడి స్క్రీన్‌కు అంటుకోవడంతో సినిమా రన్ అవుతుండగానే మొత్తం కాలిపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేసి పోలీసులకు సమాచారం అందించారు.


Next Story

Most Viewed