తండ్రి బాటలోనే తనయుడు.. గొప్ప మనసు చాటుకుంటున్న గౌతమ్‌

by Disha Web Desk 10 |
తండ్రి బాటలోనే తనయుడు.. గొప్ప మనసు చాటుకుంటున్న గౌతమ్‌
X

దిశ, సినిమా: చిన్నపిల్లలకు సాయపడటంలో ఎప్పుడూ ముందుంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘మహేశా బాబు ఫౌండేషన్’ ద్వారా ఇప్పటివరకు వేల మంది పేద పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేయించి వారికి పునర్జన్మ ప్రసాదించాడు. తాజాగా మహేష్ ‘మహేష్ బాబు ఫౌండేషన్’, ‘రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్’ (ఆర్సిహెచ్ఐఐ) భాగస్వామ్యంతో ‘ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ (పీఎలెచ్ఎఫ్)’ ను ఆవిష్కరించారు. ఈ ఫౌండేషన్‌లో భాగంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పేద పిల్లలకు ఉచితంగా చికిత్స అందించనున్నారు.

ఇకపోతే మహేష్ కుమారుడు గౌతమ్‌ కూడా ఎంబీ ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో షేర్‌ చేసింది. ఆస్పత్రిలో ఓ బాలుడు బెడ్‌పై ఉండగా గౌతమ్‌ పక్కన కుర్చీలో కూర్చుని ఆ బాలుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బాలుడికి గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడు గౌతమ్. అంతేకాదు పిల్లల ఆరోగ్యం గురించి అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నాడు. నమ్రత తన పోస్టు‌లో ఈ విధంగా రాసుకొచ్చింది. ‘గౌతమ్‌ తరచుగా రెయిన్‌బో చిన్న పిల్లల ఆస్ప్రతికి వెళ్లి అక్కడ చిన్నారులను కలుస్తూ ఉంటాడు. రెయిన్‌బో చిన్న పిల్లల ఆస్పత్రితో కలిసి ఎంబీ ఫౌండేషన్‌ చిన్న పిల్లలకు పునర్జన్మ ఇస్తోంది. గౌతమ్‌ కూడా మా ఫౌండేషన్‌లో భాగంగా ఉన్నాడు. అప్పుడప్పుడు ఆంకాలజీ, కార్డియో వార్డులోని పిల్లలను కలుస్తూ వారితో కొంత సమయాన్ని గడుపుతూ ఉంటాడు. చిన్న పిల్లలు త్వరగా కోలుకునేలా వారి పెదాలపై నవ్వులు తీసుకువస్తున్నందుకు గౌతమ్‌కు కృతజ్ఞతలు’ అని చెప్పుకొచ్చింది నమ్రత. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.

Read More : మహేష్ బాబు హీరో అయ్యాక డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమా ఎదో తెలుసా?


Next Story