ఇక మెగా ఫ్యామిలీ పరువు కాపాడాల్సింది బన్నీనే.. మెగాస్టార్- చరణ్ కూడా వేస్టే?

by Disha Web Desk 9 |
ఇక మెగా ఫ్యామిలీ పరువు కాపాడాల్సింది బన్నీనే.. మెగాస్టార్- చరణ్ కూడా వేస్టే?
X

దిశ, సినిమా: మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. ఆల్మోస్ట్ చిరంజీవి నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లనే చెప్పుకోవచ్చు. రీసెంట్‌గా తెరకెక్కిన ‘భోళాశకంర్’ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. అలాగే ఈయన కుమారుడు రామ్ చరణ్ మొదట్లో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఇక నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన కుమారుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్నారు. ఇకపోతే తాజాగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

అయితే 2024 సినీ ఇండస్ట్రీకి చాలా కీలకం. ఎంతో మంది అగ్ర హీరోల సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ ఏడాది విడుదలయ్యే మెగా హీరోల చిత్రాలపై ఫ్యాన్స్ పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదని తెలుస్తుంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం.. రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ హిట్ అవుతుందని పెద్దగా నమ్మకం లేదంటున్నారు ఫ్యాన్స్.

అంతేకాకుండా వశిష్ట-చిరంజీవి కలయికలో వస్తున్న మూవీపై హెప్స్ వదిలేశారు. ఇక వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ గురించైతే నెటిజన్లు మొత్తమే పట్టించుకోవడం లేదు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. పెండింగ్ లో ఉన్న సినిమాలైనా పూర్తి చేస్తారా? లేదా? అన్న నమ్మకం లేదు. కాగా మెగా ఫ్యామిలీ పరువు నిలబెట్టే రెస్పాన్సిబులిటీ కేవలం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పైనే ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఎలాగు పుష్ప పార్ట్ -1 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కాబట్టి.. పుష్ప -2 కూడా తప్పకుండా వరల్డ్ వైడ్ సెంచరీ సృష్టిస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Next Story

Most Viewed