పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. BRO కటౌట్లో అభిమానుల ఫొటోస్ స్కెచ్

by Disha Web Desk 7 |
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. BRO కటౌట్లో అభిమానుల ఫొటోస్ స్కెచ్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘బ్రో’. డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ మూవీ జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచిస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ప్రమోషన్స్‌లో అభిమానులను సైతం ఇన్వాల్వ్ చేసే ప్లాన్ వేశారు. ఈ మేరకు ఫ్యాన్స్‌ ఫొటోలతో కటౌట్లు తయారు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు.

ఇక, పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబో కటౌట్లలో ఫ్యాన్స్ ఫొటోలు సైతం ఉండబోతుండగా.. అభిమానుల ఫొటోలను పంపాల్సిందిగా పిలుపునిచ్చారు. దీని కోసం ఓ లింక్‌ను ఇచ్చి.. అది క్లిక్ చేసి ఫొటో అండ్ డిటెయిల్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన లింక్‌ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తన అఫిషియల్ హ్యాండ్‌లో పొందుపరచి.. మీకోసం జీవితాంతం గుర్తుండిపోయే కటౌట్ క్రియేట్ చేస్తాం అని ఆఫర్ ఇచ్చింది. ఈ వార్త తెలిసిన అభిమానులు ఇప్పటికే వారి ఫొటోలను పంపే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read More: పెళ్లికి ముందే ఆ హీరోతో రిలేషన్‌.. అబార్షన్ చేయించుకున్న ఐశ్వర్యరాయ్.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్



Next Story