Ram Charan ను అక్కడే పెళ్లి చేసుకున్నా.. టైగర్ నాగేశ్వరరావు హీరోయిన్ కామెంట్స్ వైరల్

by Disha Web Desk 6 |
Ram Charan ను అక్కడే పెళ్లి చేసుకున్నా.. టైగర్ నాగేశ్వరరావు హీరోయిన్ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ గాయత్రీ భరద్వాజ్ 2018 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నది. ఆ తర్వాత మిస్ యునైటెడ్ కాంటినెంట్స్‌గా కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు మాస్ మహారాజ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమా నేడు అక్టోబర్ 20న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది.

ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న గాయత్రీ భరద్వాజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ‘‘ నేను రామ్ చరణ్‌కు పెద్ద ఫ్యాన్‌ను. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకునేదాన్ని అని తెలిపింది. దానికి యాంకర్ చరణ్‌కి ఆల్రెడీ పెళ్లైపోయింది కదా అని ప్రశ్నించిందట. దానికి గాయత్రి అవును కానీ నా కలల్లో, ఊహల్లో ఎప్పుడో ఆయనను పెళ్లి చేసుకున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గాయత్రీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి : అన్నీ అమ్మకు నచ్చినట్లే.. నాకంటూ సొంత అభిప్రాయం లేదు: షారుఖ్ కూతురు



Next Story

Most Viewed