పొలిటికల్ లీడర్స్ కోసం పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టకండి : సింగర్ శ్రీరామచంద్ర

by Disha Web Desk 10 |
పొలిటికల్ లీడర్స్ కోసం పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టకండి : సింగర్ శ్రీరామచంద్ర
X

దిశ, సినిమా: పొలిటికల్ లీడర్స్ కోసం పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టవద్దంటూ సింగర్ శ్రీరామచంద్ర సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ప్రభుత్వ ప్రతినిధుల మీటింగ్, పొలిటికల్ ఈవెంట్స్, రోడ్ షో, కాన్వాయ్స్ అంటూ రోడ్లపై ట్రాఫిక్ మళ్లించడం ద్వారా జనాలు ఇబ్బంది పడుతుండటంఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటుంది. రీసెంట్‌గా ఓ పొలిటీషియన్ కోసం పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ బ్లాక్ చేశారు. దీంతో పబ్లిక్ రూటు మార్చి ఫ్లై ఓవర్ కింది నుంచి పోవాల్సి వచ్చింది. ఫుల్ ట్రాఫిక్‌తో జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇందులో టాలీవుడ్ సింగర్ శ్రీరామచంద్ర కూడా ఉన్నాడు. ఆయన తాను ఎదుర్కొన్న ఇబ్బందిని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ''ఓ పొలిటీషియన్ కోసం పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ బ్లాక్ చేశారు. హెవీ ట్రాఫిక్‌తో అరగంట ఆలస్యమైంది. నేను గోవా వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యింది. గోవాలో ఒక ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉండే. వేరే ఫ్లైట్ పట్టుకొని గోవా వెళ్లినా చేరుకోవడం కష్టం. నాతో పాటు మరికొందరు ఇదే రీజన్‌తో ఫ్లైట్ మిస్ అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గారికి నా విన్నపం ఏమిటంటే.. పొలిటికల్ లీడర్స్ కోసం సామాన్య జనాలను ఇబ్బంది పెట్టకండి'' అంటూ వీడియో షేర్ చేశారు.

Next Story

Most Viewed