ఏడాది పాటు వీటిని ముట్టుకోలేదు ఫైనల్‌గా.. Samantha పోస్ట్ వైరల్

by Disha Web Desk 7 |
ఏడాది పాటు వీటిని ముట్టుకోలేదు ఫైనల్‌గా.. Samantha పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఖుషి’ మూవీ అనంతరం సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్‌‌తో బాధ పడుతున్న సామ్ ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ హెల్త్ పైనే పెట్టాలని డిసైడ్ చేసుకుంది. తనకున్న వ్యాధి కారణంగా సమంత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కనీసం లేచి నిల్చుని తన పనులు తాను చేసుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. ఇక తాన ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసుకుని మొత్తంగా తన హెల్త్‌పై ఫోకస్ పెట్టింది.

అలా ఎంతో కష్టపడి డైట్ మెయింటైన్ చేస్తూ వచ్చినట్లు తెలుస్తోంది. ఏడాది పాటు ఆహారం విషయంలో ఎంతో కఠినంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే సమంత తాజా పోస్ట్ చూస్తే ఆమె ఫుడ్ విషయంలో ఎంతో కష్టపుడుతుందని అర్థం అవుతోంది. సామ్ పెట్టిన తాజా పోస్ట్ ప్రకారం.. ‘పదహారు నెలలుగా ఈ బ్రెడ్డు ముక్కను ముట్టలేదు. ఫైనల్‌గా ఇప్పుడు తింటున్న’ అంటూ చెప్పుకొచ్చింది. తన ఇన్‌గ్రామ్ స్టోరీస్‌లో ఈ పోస్ట్ పెట్టడంతో.. పాపం ఎంతో కష్టం వచ్చిందో సామ్‌కి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed