- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంతో కష్టపడినా ఫలితం దక్కలేదు.. ఎవరో ఒకరు ముందుకు వచ్చి నన్ను కాపాడండి: ఆండ్రియా
ఆ రెండు చిత్రాల కోసం మీలాగే నేను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.

దిశ, సినిమా: గ్లామర్తోనే కాకుండా తన నటనతోనూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే ఆండ్రియా జెర్మియా ఇప్పుడు ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒక నటిగా తన వంతు కష్టపడి షూటింగ్ పూర్తి చేసినప్పటికీ, ఆమె నటించిన రెండు క్రేజీ ప్రాజెక్టులు పిశాచి-2, మానుషి విడుదల నోచుకోలేదు. తాజాగా, ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆండ్రియా, తన సినిమాల విడుదల గురించి వస్తున్న ప్రశ్నలకు చాలా ఎమోషనల్గా సమాధానమిచ్చారు. ‘‘ఆ రెండు చిత్రాల కోసం మీలాగే నేను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. కానీ అవి ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయో నాకే తెలియదు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాలకు నిర్మాత పరమైన సమస్యలు అడ్డుగా మారాయి.ఎవరో ఒకరు పెద్ద మనసు చేసుకుని ముందుకు వచ్చి, ఆ సినిమాలను ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆదుకోవాలి. ఎంతో కష్టపడి చేసినా ఫలితం దక్కడం లేదు. అదే నాకు బాధగా ఉంది" అని చెప్పుకొచ్చింది. ఒక నటిగా తన వంతు పని పూర్తి చేశానని, ఇప్పుడు అంతా నిర్మాతలు, బయ్యర్ల చేతుల్లోనే ఉందని ఆమె స్పష్టం చేశారు.
ముఖ్యంగా మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన ‘పిశాచి-2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి, కానీ ఆర్థిక చిక్కుల వల్ల అది వాయిదా పడుతూ వస్తోంది. ఆగిపోయిన రెండు సినిమాలను కూడా ఏదో ఒక ఓటీటీ సంస్థ అయినా కొనుగోలు చేసి విడుదల చేస్తే బాగుంటుందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ నిరాశలో ఉన్న ఆండ్రియా అభిమానులకు ఒక క్రేజీ అప్డేట్ కూడా అందింది. స్టార్ హీరో శింబు సరసన ‘అరసన్’ అనే భారీ చిత్రంలో ఆమె నటించబోతున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో రాబోతుండగా..కలైపులి ఎస్. థాను నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ‘వడచెన్నై’కి సీక్వెల్గా రాబోతున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఆండ్రియా చంద్ర పాత్రలో కనిపించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రేజీ కాంబినేషన్ ఆండ్రియా కెరీర్కు మళ్ళీ పూర్వ వైభవం తెస్తుందని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.






