జాక్వెలిన్‌కు గుడ్ న్యూస్ చెప్పిన పాటియాలా కోర్టు.. పర్మిషన్ గ్రాంటెడ్

by Disha Web Desk 17 |
జాక్వెలిన్‌కు గుడ్ న్యూస్ చెప్పిన పాటియాలా కోర్టు.. పర్మిషన్ గ్రాంటెడ్
X

దిశ, సినిమా: సెక్సీ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దుబాయ్ వెళ్లేందుకు కోర్టు అనుమతి పొందింది. రూ. 200 కోట్ల దోపిడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. ఇటీవల ఓ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అనుమతి కావాలని కోర్టుకు విన్నవించుకుంది. ఈ మేరకు తన అభ్యర్థనను పరిశీలించిన ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జనవరి 27-30 వరకు దుబాయ్ వెళ్లేందుకు అనుమతిని మంజూరు చేసింది. నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తోపాటు జాక్వెలిన్‌కు కూడా ఈ కేసుకు సంబంధం ఉందన్న కారణంగా కేసు నమోదు చేయగా.. ఆమెకు గతేడాది బెయిల్ మంజూరు కావడంతో కోర్టు ముందస్తు అనుమతితో విదేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి: రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్ కూతురు.. పిక్స్ వైరల్!

Next Story

Most Viewed