నా కోలీవుడ్ సినిమాతో దయచేసి ఆడుకోవద్దు.. బాలీవుడ్ మీడియాపై కంగన ఫైర్

by Disha Web Desk 7 |
నా కోలీవుడ్ సినిమాతో దయచేసి ఆడుకోవద్దు.. బాలీవుడ్ మీడియాపై కంగన ఫైర్
X

దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ‘చంద్రముఖి 2’తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. లేడీస్ అండ్ కిడ్స్ తన స్క్రీన్ ప్రజెన్స్‌ను ఎంజాయ్ చేసేందుకు థియేటర్స్‌కు తరలివస్తున్నారు. ముఖ్యంగా తమిళనాట ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతుండగా.. బాలీవుడ్‌లో మాత్రం టాక్ అంతంత మాత్రంగానే ఉంది. పైగా అక్కడ మీడియా కూడా ఆ విధంగానే ప్రచారం చేస్తుంది. దీంతో విసిగిపోయిన కంగన.. తన కోలీవుడ్ ఫిల్మ్‌ను దయచేసి వదిలేయాలని బాలీవుడ్ మీడియాను కోరింది. నెగెటివ్ ప్రమోషన్ మానుకోవాలని సూచించింది. కాగా చంద్రముఖిగా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కగా.. వీకెండ్ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.

Next Story