కెమెరామెన్ గంగతో రాంబాబు రీరిలీజ్.. థియేటర్స్‌లో మంటలు పెట్టిన పవన్ ఫ్యాన్స్!

by Disha Web Desk 8 |
కెమెరామెన్ గంగతో రాంబాబు రీరిలీజ్.. థియేటర్స్‌లో మంటలు పెట్టిన పవన్ ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : ప్రస్తుతం రీరిలీజ్ సందడి కొనసాగుతోంది.తాజాగా ఫిబ్రవరి7న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు రీరిలీజైన విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ హడావిడి మాములుగా లేదు.పవన్ మీద ఉన్న అభిమానంతో ఏకంగా వీరు ఓ థియేటర్‌నే తగలబెట్టేంత పని చేశారు.ఏపీలోని ఓ థియేటర్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మూవీ చూస్తూ కాగితాలు చింపి విసిరేశారు. తర్వాత పూనకాలు వచ్చినట్లూ ఊగి, కొన్ని కాగితాలు పేర్చి మంట పెట్టారు.

అంతేకాకుండా దాని చుట్టూ తిరుగుతూ, ప్లకార్డ్స్ పట్టుకుని నానా రచ్చ చేశారు. థియేటర్‌లో నిప్పు రవ్వలు గాలికి ఎగురుతూ పడుతుంటే.. ఫ్యాన్స్ మాత్రం కేకలు పెడుతూ, జై పవన్ కల్యాణ్ అంటూ సంతోషంలో మునిగిపోయారు. దీంతో ఇది గమనించిన యాజమాన్యం వెంటనే స్పందించి ఆ మంటలు ఆర్పేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 2012లో 1600 పైగా స్క్రీన్స్‌పై విడుదలైన ఈ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక రాంబాబు పాత్రలో పవన్ కళ్యాణ్, గంగపాత్రలో తమన్నా కనిపించి ప్రేక్షకులను అలరించారు.


Next Story

Most Viewed