వృషకర్మ షూటింగ్‌కి బ్రేక్.. భార్యతో కలిసి పుణ్యక్షేత్రాల బాట పట్టిన నాగచైతన్య.

by Mallepaka Hamsa |

పెళ్లయి మూడు నెలలు కావస్తున్న సమయంలో.. ఈ కొత్త జంట స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వృషకర్మ షూటింగ్‌కి బ్రేక్.. భార్యతో కలిసి పుణ్యక్షేత్రాల బాట పట్టిన నాగచైతన్య.
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య(Naga Chaitanya)- శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala ) శనివారం ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. పెళ్లయి మూడు నెలలు కావస్తున్న సమయంలో.. ఈ కొత్త జంట స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ భద్రత నడుమ ఆలయానికి చేరుకున్న వీరు, అక్కడ కొంత సమయం గడిపి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. నాగచైతన్య సాంప్రదాయబద్ధంగా తెల్లటి చొక్కా, ధోతీ ధరించగా, శోభిత ఎరుపు రంగు చీరలో ఎంతో అందంగా మెరిసిపోయారు.

అభిమానులతో ముచ్చటించిన చైతన్య, చిరునవ్వుతో జై జగన్నాథ్ అన్నారు. ఇది చూసిన అక్కడ ఉన్న భక్తులు, అభిమానులు కేరింతలు కొట్టారు. కాగా.. చైతన్య, శోభితల బంధం 2022లో మొదలైంది. సమంతతో విడాకుల తర్వాత వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ చాలా వార్తలు వచ్చాయి. విదేశాల్లో వీరు కలిసి దిగిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేశాయి. చివరకు ఆగస్టు 2024లో హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకుని తమ బంధాన్ని అధికారికం చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 4, 2024న అత్యంత సన్నిహితుల మధ్య వేడుకగా వివాహం చేసుకున్నారు.

ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘వృషకర్మ’ షూటింగ్‌‌కు బ్రేక్ ఇచ్చి భార్యతో ఆలయాలకు బాట పట్టారు. కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హారర్, మైథాలజీ, అడ్వెంచర్ అంశాలతో రూపొందుతోంది. ఇందులో చైతన్య సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇక శోభిత విషయానికొస్తే, ఆమె చివరిగా జనవరి 2026లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘చీకటిలో’ తో ప్రేక్షకులను అలరించారు. పెళ్లి తర్వాత కూడా ఈ ఇద్దరూ తమ కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. సమయం దొరికినప్పుడల్లా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ.. ప్రత్యేక పూజలు చేయడం విశేషం. అయితే ఇదంతా పిల్లల కోసమే చేస్తున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Next Story