సౌత్‌ ఇండస్ట్రీలపై కన్నేసిన బాలీవుడ్ స్టార్స్.. వరుస సినిమాలతో బిజీ

by Disha Web Desk 13 |
సౌత్‌ ఇండస్ట్రీలపై కన్నేసిన బాలీవుడ్ స్టార్స్.. వరుస సినిమాలతో బిజీ
X

దిశ, సినిమా: సౌత్ మూవీలతో బాలీవుడ్ స్టార్స్ ప్రస్తుతం బిజీ అవుతున్నారు. ముందుగా అమితాబ్ బచ్చన్ 2014లో విడుదలైన 'మనం' చిత్రంలో అతిథి పాత్రలో నటించి తెలుగు లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' మూవీ లో కీలక పాత్ర పోషించాడు. మళ్లీ ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ప్రాజెక్ట్ K' లో కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. దీపికా పదుకొనే కూడా ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెడుతుంది.

సంజయ్ దత్ :

నాగార్జున నటించిన రొమాంటిక్ డ్రామా 'చంద్రలేఖ' మూవీలో తొలిసారి తెలుగు సినిమాలో కనిపించాడు సంజయ్ దత్. తర్వతా 'KGF చాప్టర్: 2'లో ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ప్రస్తుతం తలపతి విజయ్ నటిస్తున్న 'లియో' సినిమాతో తమిళంలోకి అడుగుపెడుతున్నాడు. దీంతోపాటుగా ప్రభాస్-మారుతి కాంబోలో వస్తున్న 'రాజా డీలక్స్‌' చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

సైఫ్ అలీఖాన్ :

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్నా పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్‌'లో రావణాసురుడిగా సౌత్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు సైఫ్. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్‌టీఆర్‌ 30వ చిత్రంలోనూ విలన్‌గా కనిపించనున్నాడు.

నవాజుద్దీన్ సిద్దిఖీ :

2019లో వచ్చిన 'పెట్టా' తో తమిళంలోకి అడుగుపెట్టిన నవాజ్.. వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం 'సైంధవ్‌'తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

బాబీ డియోల్ :

టాలీవుడ్ స్టార్ నటుడు పవన్ కల్యాణ్ రాబోయే చిత్రం 'హరి హర వీర మల్లు' తో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు బాబీ.

అభిషేక్ బచ్చన్ :

దర్శకుడు గౌతమ్ మీనన్.. విజయ్ సేతుపతి, అభిషేక్ బచ్చన్‌లతో ఓ మల్టీ స్టారర్‌ను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే దీని గురించిన స్క్రిప్ట్‌ను అభిషేక్‌కి వివరించగా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఈ ప్రాజెక్ట్‌కి అభిషేక్ సంతకం చేస్తే.. సౌత్‌లో తన తొలి సినిమా అవుతుంది.

భూమి పెడ్నేకర్ :

మహేష్ బాబు–త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న 'SSMB 28'లో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్‌ను ఓ కీలక పాత్ర కోసం ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది భూమి.



Next Story

Most Viewed