- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kangana Ranaut: చుట్టూ ఉన్న మూర్ఖులతో జాగ్రత్త.. అలాంటి వ్యక్తులను నమ్మకూడదంటూ కంగనా షాకింగ్ పోస్ట్
ఇండోర్కు చెందిని రాజా రఘువంశీ(raja Raghuvamshi) హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

దిశ, సినిమా: ఇండోర్కు చెందిని రాజా రఘువంశీ(raja Raghuvamshi) హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆయన భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvamshi)పెళ్లైన కొద్ది రోజులకే భర్తను దారుణంగా చంపడంతో అసలు విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. మే 11న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి పెళ్లి జరగ్గా మే 20న మేఘాలయకు హనీమూన్కు వెళ్లారు. మే 23న రాజా మిస్సవ్వడంతో కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలించగా.. హత్యకు గురైనట్లు తేలింది. అయితే ఇందులో ఆమె కీలక నిందితురాలిగా పరిగణించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ సంఘటనపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా(Kangana Ranaut) ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ‘‘రాజా రఘువంశీ హత్య కేసు అసలు అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇది నన్ను కదిలించింది. ఇది చాలా అసంబద్ధం.
ఒక మహిళ తన తల్లిదండ్రులకు భయపడి వివాహాన్ని తిరస్కరించదు. కానీ ఆమె కాంట్రాక్ట్ కిల్లర్తో క్రూరమైన హత్యకు ప్లాన్ చేస్తుంది. ఉదయం నుంచి ఈ విషయం నా మనసులో మెదులుతోంది. కానీ అర్థం కావడం లేదు. అయ్యో, ఇప్పుడు నాకు తలనొప్పిగా ఉంది. ఆమె విడాకులు తీసుకోలేదు. తన ప్రేమికుడితో పారిపోలేదు. ఎంత క్రూరమైనది, హేయమైనది, అన్నింటికంటే అసంబద్ధం, మూర్ఖత్వం. తెలివితక్కువ వ్యక్తులను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. వారు సమాజానికి అతిపెద్ద ముప్పు. మనం తరచుగా వారిని చూసి నవ్వుతాము. వారు ప్రమాదకరం కాదని అనుకుంటాము.. కానీ అది నిజం కాదు. మేధావులు తమ స్వలాభం కోసం ఇతరులకు హాని కలిగించవచ్చు కానీ ఒక మూర్ఖుడికి అతను ఏమి చేస్తున్నాడో తెలియదు. గుర్తుంచుకోండి. మీ చుట్టూ ఉన్న మూర్ఖుల నుంచి జాగ్రత్తగా ఉండండి’’ అని రాసుకొచ్చింది.






