'బంగారు తెలంగాణ' ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది: బిపిన్

by Disha Web Desk 13 |
బంగారు తెలంగాణ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది: బిపిన్
X

దిశ, సినిమా: బిపిన్, రమ్య జంటగా షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి రమ్య సమర్పణలో సాయి చరణ్, సాయి త్రిశాంక్ నిర్మాణ సారథ్యంలో డా. ఏవి స్వామి, డా. ఏవి అనురాధ కో ప్రొడ్యూసర్స్‌గా బిపిన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బంగారు తెలంగాణ'. ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకున్న చిత్రానికి 'యు' సర్టిఫికెట్ లభించింది. కాగా త్వరలోనే విడుదల కానున్న మూవీ గురించి దర్శకనిర్మాత బిపిన్ ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు.

'బంగారు తెలంగాణ కోసం విద్యార్థులు ఎన్నో ఉద్యమాలు చేసి తమ ప్రాణాలను అర్పించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడారు. అందరి సమిష్టి కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత ఎలాంటి మార్పులు సంభవించాయనే అంశాలను ఈ సినిమాలో క్లియర్ కట్‌గా చూపిస్తున్నాం. వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తున్న చిత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది' అన్నాడు.

Next Story

Most Viewed