ఇద్దరు స్టార్ హీరోలతో సహా.. ముగ్గురు నటులపై బ్యాన్?

by Disha Web Desk 4 |
ఇద్దరు స్టార్ హీరోలతో సహా.. ముగ్గురు నటులపై బ్యాన్?
X

దిశ, వెబ్‌డెస్క్: కోలివుడ్ చిత్ర పరిశ్రమలో బ్యాన్ అంశం తాజాగా సంచలనంగా మారింది. గతంలో స్టార్ కమెడియన్ వడివేలుకి రెడ్ కార్డ్ ఇష్యూ చేయడంతో పదేళ్ల పాటు సినిమా చాన్స్ లు లేకుండా పోయాయి. తాజాగా కోలీవుడ్‌లో తమిళ స్టార్ హీరోలు శింబు, విశాల్, నటులు ఎస్ జే సూర్య, యోగి బాబు, అధర్వలపై కోలీవుడ్ నిర్మాతల మండలి రెడ్ కార్డ్ ఇష్యూ చేసింది. ప్రొడక్షన్ హౌజ్‌లకి సరిగా రెస్పాండ్ కాకపోవడం, అడ్వాన్స్‌లు తీసుకుని డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడం, సెట్స్‌లో వివాదాల కారణంగానే ఈ రెడ్ కార్డ్ ఇష్యూ చేసినట్లు తెలిసింది.

దర్శకుడు గోకుల్ చిత్రం కరోనా కుమార్ నుంచి వైదొలిగినందుకు శింబు, లైకా ప్రొడక్షన్స్ డబ్బులు తిరిగి చెల్లించనందుకు విశాల్‌పై వేటు పడింది. అడ్వాన్స్ తీసుకుని నిర్మాతలకు డేట్స్ ఇవ్వనందుకు ఎస్ జే సూర్య, యోగిబాబు, అధర్వలపై యాక్షన్ తీసుకున్నారు. ఈ మేరకు తమిళనాడు నిర్మాతల మండలి, ఎన్ రామసామి నేతృత్వంలో జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇష్యూపై కోలివుడ్ ప్రముఖులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.

Also Read..

మెగా ఫ్యామిలీ ఇంట్లో సంబరాలు.. రేపు రాబోతున్న కొత్త బంధువు..!

Next Story

Most Viewed