‘మిసెస్ ఇండియా గ్లోబ‌ల్’ ఫైన‌ల్స్‌కు చేరుకున్న అంకిత ఠాకూర్‌

by Disha Web Desk 23 |
‘మిసెస్ ఇండియా గ్లోబ‌ల్’ ఫైన‌ల్స్‌కు చేరుకున్న అంకిత ఠాకూర్‌
X

దిశ, సినిమా : ప్రముఖ సినీన‌టి అంకిత ఠాకూర్.. పెగాసిస్ వారు నిర్వహిస్తోన్న ‘మిసెస్ ఇండియా గ్లోబ‌ల్’ ఫైన‌ల్స్‌కు సెల‌క్ట్ అయింది. ఏప్రిల్ 11న కేర‌ళలోని కొచ్చిలో ఈ ఫైన‌ల్స్ జ‌ర‌గనుండగా ఫిలించాంబ‌ర్‌లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు అంకిత. ఈ కార్యక్రమంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వ‌హిస్తూ ‘మిసెస్ ఇండియా గ్లోబ‌ల్’ ఫైన‌ల్స్‌కు చేరుకోవ‌డం చాలా సంతోషంగా ఉదన్న ఆమె తెలంగాణ ప్రజ‌లంతా ఓటింగ్ ద్వారా గెలిపించాలని కోరింది. అలాగే ‘మిస్ ఏసియా’ ర‌ష్మి ఠాకూర్‌ మాట్లాడుతూ.. అంకిత అవార్డుతో గెలుచుకుంటుందనే న‌మ్మకం ఉందని, అందరూ స‌పోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేసింది. చివరగా ఫైన‌ల్స్‌కు చేరుకున్న అంకితకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఫిలిం చాంబ‌ర్ ఛైర్మన్ డా.ప్రతాని రామ‌కృష్ణ గౌడ్ తెలంగాణ ప్రజ‌ల‌తో పాటు, తెలుగు వారంద‌రూ ఆమెకు ఓట్లు వేసి సపోర్ట్ చేయాలన్నారు.

Next Story