- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘యుగానికి ఒక్కడు-2’ నుంచి తప్పుకున్న ఆండ్రియా.. సెల్వరాఘవన్తో పని చేయడం కష్టమంటూ షాకింగ్ కామెంట్స్!
నా నుండి ఈ సినిమా సీక్వెల్ ఆశించవద్దు. ఆ సినిమా జరిగితే మంచిదే, కానీ అందులో నేను మాత్రం ఉండను.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కెరీర్లో క్లాసిక్ హిట్గా నిలిచిన సినిమా ‘యుగానికి ఒక్కడు’. విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించిన ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడమే కాకుండా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. గత కొంతకాలంగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. దర్శకుడు సెల్వరాఘవన్ ఈ రెండో భాగం కోసం స్క్రిప్ట్ పనులను దాదాపు పూర్తి చేశారని తెలుస్తోంది. అయితే, ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల 2026లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సీక్వెల్ వార్తలు వస్తున్న నేపథ్యంలో, మొదటి భాగంలో నటించిన నటీనటులు ఇందులో ఉంటారా? లేదా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ముఖ్యంగా కీలక పాత్ర పోషించిన నటి ఆండ్రియా ఈ విషయంపై స్పందిస్తూ షాకింగ్ క్లారిటీ ఇచ్చింది.
‘యుగానికి ఒక్కడు-2’లో తాను నటించడం లేదని ఆమె స్పష్టం చేసింది. "నా నుండి ఈ సినిమా సీక్వెల్ ఆశించవద్దు. ఆ సినిమా జరిగితే మంచిదే, కానీ అందులో నేను మాత్రం ఉండను. ఎందుకంటే సెల్వరాఘవన్ సార్తో పనిచేయడం అంటే అది మామూలు విషయం కాదు, చాలా కష్టం" అని ఆండ్రియా పేర్కొంది. మొదటి భాగం షూటింగ్ సమయంలో తాము ఎదుర్కొన్న కష్టాలను ఆమె గుర్తు చేసుకుంది. కేవలం ఒక సినిమా కోసం ఏకంగా 200 రోజులు షూటింగ్లో పాల్గొన్నామని, ఆ సమయంలో పడిన శ్రమ వర్ణనాతీతమని చెప్పింది. అయితే, ఆ సినిమాలో పడిన కష్టం వల్లే ఆ తర్వాత తాను చేసిన ఏ పాత్రనైనా చాలా సులభంగా చేయగలిగానని ఆమె వెల్లడించింది. సెల్వరాఘవన్ పనితీరుపై ఆండ్రియా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. మరి ఆండ్రియా లేని ఈ సీక్వెల్ ఎలా ఉండబోతుందో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ఈ సీక్వెల్లో ధనుష్ సరసన ఎవరు హీరోయిన్గా నటిస్తారనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.






