మేనేజర్ మృతి.. కంటతడి పెట్టిస్తోన్న యాంకర్ ఝాన్సీ పోస్ట్

by Disha Web Desk 9 |
మేనేజర్ మృతి.. కంటతడి పెట్టిస్తోన్న యాంకర్ ఝాన్సీ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ ఝాన్సీ టాలీవుడ్‌ అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్‌గా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ‘దసరా’ మూవీలో ఎమోషనల్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. కామెడీ పండించడంలో, గయ్యాళిగా నటించడంలో ఝాన్సీ తర్వాతే ఎవరైనా. ఈమె బుల్లితెర యాంకర్‌గా కూడా ఎంతో గుర్తింపు పొందారు. తాజాగా ఝాన్సీ మేనేజర్ శ్రీను (35) గుండెపోటు కారణంగా మరణించారు. దీంతో ఈ యాంకర్ తీవ్ర భావోద్వేగానికి గురవుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

‘‘నేను ముద్దుగా శీను బాబు అని పిలుచుకుంటా. శ్రీను నా మేనేజర్ మాత్రమే కాదు. నా కుటుంబ సభ్యుడు కూడా. నా తమ్ముడి కంటే ఎక్కువ. శీను నాకు పెద్ద సపోర్ట్‌గా నిలిచాడు. నన్ను ఎంతో బ్యాలెన్స్‌గా ఉంచాడు. చాలా మంచి మనసు కలిగినవాడు. నిజాయితీ పరుడు. నా పనులన్నీ చక్కగా నిర్వర్తించాడు. 35 ఏళ్లకే గుండెపోటు రావడం ఏంటో.. శ్రీను మృతిని నేను జీర్ణించుకోలేకున్నా. నాకు మాటలు కూడా రావడం లేదు. జీవితం నీటి బుడగ లాంటిది’’ అంటూ ఝాన్సీ ఎమోషనల్ అవుతూ రాసుకొచ్చింది.






Next Story

Most Viewed