- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వైసీపీ - జనసేన మధ్యలో అనసూయ.. అసలేం జరిగిందంటే..?
దిశ,వెబ్ డెస్క్: తాజాగా కృష్ణా జిల్లా పోరంకిలో పవర్స్టార్ అభిమానులు చేసిన సందడి మనందరికి తెలిసిందే. వంగవీటి రాధా వివాహానికి హాజరైన పవన్ కల్యాణ్ను చూసేందుకు జనం ఎగబడటంతో వారిని ఆపడం ఎవరివల్లా కాలేదు. ఆ తోపులాటలో మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా చిక్కుకుపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
వైఎస్ జగన్ వచ్చినా ప్రజలు ఇదేస్థాయిలో ఎగబడతారని, తాము ఎందులోను తీసిపోలేదంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మరొక నెటిజన్ అయితే 'అనసూయ, రష్మీ ఇక్కడికి వచ్చినా జనం ఇలాగే ఎగబడతారు' అంటూ చేసిన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అయితే ఇలా వ్యాఖ్యానించడాన్ని అనసూయ తప్పుబట్టింది. " మాకు సంబంధం లేని వేడుకలో మా పేర్లు తీసుకురావడం ఒక తప్పు అయితే .. మా పేర్లని ప్రస్తావించి మాట్లాడం ఇంకో తప్పు ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చానని, తన ప్రయాణాన్ని తక్కువ చేసి చూడకుండా గౌరవిస్తే బాగుంటుందని పేర్కొంది. ఈ విషయంలో తమ పేర్లు ఉపయోగించడం తప్పు అని, జీవితంలో ఏదో సాధించిన వారు ఎలా ఉంటారో చూద్దామనే ఉత్సాహంతో జనం వస్తారని, మా పేర్లు వాడినంత మాత్రాన ఎవరూ సులువుగా ఈ స్థాయికి రాలేరని, ఈ విషయాన్ని అందరూ గుర్తిస్తే మంచిదని'' రిప్లై ఇచ్చింది.