పుష్ప సినిమాలో కథనాయికగా మారనున్న అనసూయ

by Dishanational2 |
పుష్ప సినిమాలో కథనాయికగా మారనున్న అనసూయ
X

దిశ, వెబ్‌డెస్క్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఇక ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనకు చాలా మంది ఫిదా అయిపోయారు. కాగా, ఈ సినిమా సిక్వేల్‌గా రెండో భాగం రానున్న విషయం తెలిసిందే. అయితే సుకుమార్ అతిని బృదం సీక్వెల్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లేదా మే మధ్య నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఫహద్ ఫాసిల్, పోలీసు భన్వర్ సింగ్ షెకావత్‌పై అల్లు అర్జున్ యుద్ధం ప్రకటించిన తర్వాత మొదటి భాగం ముగుస్తుంది. దీంతో రెండో భాగం మాఫియా డాన్‌, పోలీస్‌ల మధ్య గొడవ ఎక్కువగా ఉంటుందని ప్రేక్షకులు అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సుకుమార్ సినిమాను కొత్తగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

రెండో భాగంలో అనసూయ పాత్ర హైలెట్‌‌గా ఉండనునట్టు తెలుస్తోంది. పుష్ప సీక్వెల్‌లో అనసూయ కథానాయికగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. సుకుమార్, అతని చిత్ర బృదం అనసూయకు ఓ పవర్ ఫుల్ రోల్ ఇచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా ఇందులో ఫహద్ ఫాసిల్‌కు కూడా కీలక పాత్ర ఉంటుంది. కానీ పుష్ప: ది రూల్‌లో విలన్స్ జాబితాలో అనసూయ ముందు సీటును తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ భార్యగా రష్మిక నటిస్తుండగా, సునీల్, రావు రమేష్, ధనంజయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Next Story

Most Viewed