‘Baby’మూవీని మించేలా.. ఆనంద్, వైష్ణవి, సాయి రాజేష్ కాంబో ఫిక్స్.. కానీ దర్శకుడు ఎవరో తెలుసా..?

by Disha Web Desk 10 |
‘Baby’మూవీని మించేలా.. ఆనంద్, వైష్ణవి, సాయి రాజేష్ కాంబో ఫిక్స్.. కానీ దర్శకుడు ఎవరో తెలుసా..?
X

దిశ,వెబ్ డెస్క్: బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి వంద కోట్లు క్లబ్ లో చేరింది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యకు, విరాట్ నటించారు. వైష్ణవి చైతన్యకు , వెండి తెర పైకి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. సాయి రాజేష్‌కు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చింది. నిర్మాత ఎస్ కే ఎన్‌కు అయితే మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఇలా ఒకరికి కాదు.. ఎందరి కెరీర్‌లనో బేబీ సినిమా నిలబెట్టేసిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ టీం మరో సినిమాను చేసేందుకు ముందుకు వచ్చింది. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండల కాంబోలో మరో సినిమా రాబోతోంది. ఈ సినిమాకి సాయి రాజేష్ కథ, కథనాన్ని అందిస్తున్నాడు. కానీ దర్శకత్వం మాత్రం వేరే వ్యక్తి చేస్తున్నాడు. అదొక్కటే ట్విస్ట్. నిర్మాత ఎస్ కే ఎన్ ఈ మూవీని భారీగా నిర్మించబోతోన్నాడు.

తాజాగా ఈ కొత్త మూవీకి సంబంధించిన అప్డేట్ ఎస్ కే ఎన్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. కల్ట్ బ్లాక్ బస్టర్‌ బేబీ తరువాత మళ్లీ మా టీం, మా కాంబో మరోసారి రాబోతోంది.. సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.. టాలెంటెడ్ పెయిర్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్యలు ఇందులో నటిస్తున్నారు.. రవి నంబూరి కొత్త దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు.. మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ఎస్ కే ఎన్ ట్వీట్ వేశాడు.


Next Story