- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊహకందని మలుపు.. సల్మాన్ ఖాన్ ప్రాజెక్ట్లో అరవింద్ స్వామి పాత్రే అసలైన సస్పెన్స్!
ఈ క్రేజీ ప్రాజెక్ట్లో మరో స్టార్ నటుడు చేరబోతున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సౌత్ వర్సటైల్ యాక్టర్ అరవింద్ స్వామి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈచిత్రం షూటింగ్ ఏప్రిల్ నుంచే ప్రారంభం కానుంది. వంశీ పైడిపల్లి మార్క్ ఎమోషన్స్, సల్మాన్ ఖాన్ పవర్ ఫుల్ యాక్షన్ కలగలిపి ఈ చిత్రాన్ని ఒక పక్కా పాన్ ఇండియా ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్లో మరో స్టార్ నటుడు చేరబోతున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సౌత్ వర్సటైల్ యాక్టర్ అరవింద్ స్వామి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
అందరూ ఆయన విలన్ పాత్ర చేస్తున్నారని ఊహించుకుంటున్నారు కానీ, అసలు విషయం అది కాదట. అరవింద్ స్వామి పోషించే పాత్ర ఈ సినిమాకే హైలెట్గా నిలవనుందని, కథను మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆయన కనిపిస్తారని సమాచారం. ఈ వార్త విన్న నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మరోవైపు, ఈ భారీ ప్రాజెక్ట్లో విలన్ ఎవరనే సస్పెన్స్కు కూడా దాదాపు తెరపడినట్లే కనిపిస్తోంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు అనిల్ కపూర్ను ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్గా తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్కు ధీటుగా అనిల్ కపూర్ విలనిజం ఉండబోతోందని టాక్. అరవింద్ స్వామి, నయనతార, అనిల్ కపూర్ వంటి భారీ తారాగణం ఈ ప్రాజెక్ట్లో చేరడంతో, వంశీ పైడిపల్లి - సల్మాన్ ఖాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.






