ప్రజాస్వామిక హక్కులు తుంగలో తొక్కబడుతున్నాయి: Amitabh Bachchan ఆవేదన

by Disha Web Desk 10 |
ప్రజాస్వామిక హక్కులు తుంగలో తొక్కబడుతున్నాయి: Amitabh Bachchan ఆవేదన
X

దిశ, సినిమా : భారత్‌లో కొంతకాలంగా పౌర హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛపై పెద్ద ఎత్తున్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని అమితాబ్ బచ్చన్ చెప్పాడు. కోల్‌కతా 28వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (KIFF) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో వేదికను పంచుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన బిగ్ బీ.. ప్రజాస్వామిక హక్కులు తుంగలో తొక్కబడుతున్నాయని, ఈ విషయాన్ని తన సహచరులు, ప్రజలు కచ్చితంగా అంగీకరిస్తారని భావిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఆయన వ్యాఖ్యలపై బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ స్పందిస్తూ.. 'బాలీవుడ్‌ మెగాస్టార్‌ ముఖ్యమంత్రి @ మమతా అధికారిక తలపై మొట్టికాయలు వేశాడు. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హింసకు వ్యతిరేకంగా బాధితుల కోసం నిలబడినందుకు @SrBachchanకి ధన్యవాదాలు' అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed