తారకరత్నతో దిగిన చివరి ఫొటో షేర్ చేస్తూ ఎమోషనలైన అలేఖ్య

by Chukka Sudharani |

నందమూరి తారకరత్న అకాల మరణంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

తారకరత్నతో దిగిన చివరి ఫొటో షేర్ చేస్తూ ఎమోషనలైన అలేఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి తారకరత్న అకాల మరణంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆసుపత్రిలో 23 రోజులు మృత్యువుతో పోరాడిన ఆయన ఫిబ్రవరి 18 న తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మరణం అనంతరం తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తారకరత్న, అలేఖ్య రెడ్డిది ప్రేమ వివాహం. వారికి ముగ్గురి సంతానం. తన భర్త అకాల మరణం నుంచి అలేఖ్య రెడ్డి కోలేకపోతుంది. ఈ క్రమంలోనే తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

‘‘ఇదే మా ఆఖరి ఫొటో. ఇదే మన ఆఖరి ప్రయాణం అని నమ్మడం నా హృదయాన్ని బద్దలకొడుతుంది. ఇదంతా ఒక కల కావాలని కోరుకుంటున్నాను. నన్ను "అమ్మ బంగారు" అని పిలుస్తూ మీ స్వరానికి మేల్కొలపండి’’ అంటూ ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఎమోషనల్ అయ్యారు అలేఖ్య. ఆ పోస్ట్ చూసిన నెటిజన్స్ అలేఖ్యకు మనోధైర్యాన్ని నింపుతున్నారు.

Next Story