కూతురితో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఐశ్వర్య.. పిక్స్ వైరల్

by Dishanational4 |
కూతురితో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఐశ్వర్య.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి క్రిస్మస్ పండుగ జరుపుకుంది. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆదివారం ఉదయమే సోషల్ మీడియా వేదికగా పంచుకున్న నటి తన అభిమానులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఈ ఫొటోల్లో తన కూమార్తేతో పాటు ఐశ్వర్య తండ్రి దివంగత కృష్ణరాజ్ రాయ్ చిత్రపటం, క్రిస్మస్ ట్రీ, చేతిలో ఫ్లవర్ బొకేలతో కూడిన సెల్ఫీని ఇన్‌స్టా‌ వేదికగా షేర్ చేసింది. దీనికి 'మెర్రీ క్రిస్మస్. మచ్ లవ్. గుడ్ హెల్త్. హ్యాపినెస్. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఐశ్వర్య ఫ్యామిలీకి క్రిస్మస్ విషెస్ చెబుతూ 'వాట్ ఏ బ్యూటీ.. వాట్ ఏ గ్లో' అంటూ నటి అందాన్ని పొగిడేస్తున్నారు.

READ MORE

మోహన్‌లాల్- లిజో జోస్ పెల్లిసెరీ సినిమాకు టైటిల్ ఫిక్స్

Next Story

Most Viewed