ఆసుపత్రిలో చేరిన ఖుష్బూ.. కారణం అదేనంటూ ట్వీట్

by Dishafeatures2 |
ఆసుపత్రిలో చేరిన ఖుష్బూ.. కారణం అదేనంటూ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: నటి ఖుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించారు. ఈ మధ్యనే ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అయితే తాను అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరినట్లు ఖుష్బూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆసుపత్రిలో చేరిన ఫోటోలను కూడా షేర్ చేశారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి లక్షణాలు ఉండటంతో ఆసుపత్రిలో చేరినట్లు ఈ సందర్భంగా ఖుష్బూ తెలిపారు. ప్రస్తుతం బాగానే ఉన్నానని, కోలుకోవడానికి కొంత టైం పడుతుందని చెప్పారు. ఆరోగ్యం విషయంలో రిస్క్ తీసుకోవద్దని ఖుష్బూ తన ఫ్యాన్స్ ను కోరారు.



Next Story

Most Viewed