- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రశాంత్ జోలికి రావొద్దంటూ అసభ్యంగా మాట్లాడారు.. కన్నీళ్లు పెట్టుకున్న ఆట సందీప్ భార్య
దిశ, సినిమా: బిగ్ బాస్ సీజన్ 7లోకి కంటెస్టెంట్గా ఆట సందీప్ ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న విషయం తెలిసిందే. హౌస్లో మొదటినుంచి చురుకుగా ఉంటూ 8 వారాలుగా కొనసాగుతూనే ఉన్నాడు. అయితే తాజాగా ఆయన భార్య జ్యోతిరాజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు షాకింగ్ విషయాలు పంచుకుంది.
జ్యోతి మాట్లాడుతూ ‘ రియాలిటీ షో ఆయనకేం కొత్తకాదు. ఒక్కసారి దిగారంటే కప్పు కొట్టాల్సిందే. కానీ బిగ్ బాస్ అనేది ఒక కొత్త అనుభవం. డ్యాన్స్ వేరు. రియాలిటీ షో వేరు. పెద్ద హీరోలతో కొరియోగ్రఫీ చేయాలన్నదే మా ఆశయం. అందుకోసమే బిగ్బాస్లో వెళ్లాలని నిర్ణయించుకున్నాం. కానీ మాపై అసభ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు అది చాలా తప్పు. ఫ్యామిలీని ఇందులోకి లాగడం మంచిదేనా? ఆ విషయంలో నేను మాట్లాడి వీడియో పెట్టగానే అసభ్యకరమైన కామెంట్స్ చేశారు ‘నీ మొగుడు వేస్ట్’ అంటూ చెప్పకూడని మాటలు అన్నారు. షోలో ఉన్నవారి కుటుంబాల గురించి మాట్లాడటమేంటి? ప్రశాంత్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ప్రశాంత్ జోలికొస్తే మిమ్మల్ని వదలం. నీ మొగుడికి చెప్పు. ప్రశాంత్ జోలికి రావొద్దని.. అంటూ చెప్పలేనంత అసభ్యంగా మాట్లాడారు’ అంటూ చెప్పుకొచ్చింది జ్యోతి. ప్రజంట్ తన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.