Sai Dharam Tej కారణంగా.. తన షెడ్‌లోనున్న బైకులన్నీ అమ్మేసిన స్టార్ యాక్టర్

by Disha Web Desk 9 |
Sai Dharam Tej కారణంగా.. తన షెడ్‌లోనున్న బైకులన్నీ అమ్మేసిన స్టార్ యాక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కారణంగా సీనియర్ నటుడి కుమారుడు అతి ఖరీదైన బైక్స్‌ను అమ్మేసినట్లు నెట్టింట ఓ వార్త హల్ చల్ సృష్టిస్తోంది. అయితే సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ కృష్ణ , తేజ్ చాలా క్లోజ్‌గా ఉంటారట. రోజూ బైక్‌పై రైడ్‌కు వెళ్తూ.. ఎవరికీ కనిపించకుండా చక్కర్లు కొడుతారట. దీంతో ఇద్దరు కలిసి తిరగడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటూ గతంలో వార్తలు వినిపించాయి. దీనిపై నవీన్ తాజాగా స్పందించి.. ‘‘నా వల్లే తేజ్‌కు యాక్సిడెంట్ అయ్యిందని వార్తలు వస్తుంటే నాకు చాలా బాధేసింది. ప్రతి రోజు సాయిధరమ్ తేజ్‌ను ఇంటి వద్ద దింపాకనే నేను వెళ్తాను. కానీ ఆ రోజు నేను వెళ్తానని ఒక్కడే వెళ్లాడు. కాసేపటి తర్వాత ఈ న్యూస్ వినగానే నన్ను ఎంతగాలో కలచివేసింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. కానీ సాయిని చూడలేకపోయాను. మీడియా నేనే కారణమంటూ రాసిన వార్తల వల్ల నా షెడ్‌లో ఉన్న బైక్స్ అన్ని అమ్మేశాను.’’ అంటూ ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చాడు నవీన్. ప్రస్తుతం నవీన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : పెళ్లిలో NTR పెట్టుకున్న Watch ఖరీదెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!


Next Story