నా తల్లికి మాటిచ్చాను.. పవన్ కోసం చిరు ఎమోషనల్ పోస్ట్?

by Disha Web Desk 18 |
నా తల్లికి మాటిచ్చాను.. పవన్ కోసం చిరు ఎమోషనల్ పోస్ట్?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున సినీ నటులు ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ్ముడి కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రచారం చేయబోతున్నారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి సంచలన ట్వీట్ చేశారు.

అది ఏంటంటే..తమ్ముడు పవన్ గురించి బాధ పడుతున్న అమ్మకు చిరంజీవి ఒక మాట చెప్పాడు. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం ఇది అన్నారు. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అని చెప్పారు. మౌనంగా ఉండే మంచి వాళ్ళ వల్లే ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు అన్నారు. తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్ట సభల్లో ఆయన గొంతును మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో మీరు చూడాలంటే పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించాలి అని చెప్పారు. ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియాలో చిరంజీవి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

Next Story

Most Viewed