- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మమ్మల్ని చంపేందుకు ఇండస్ట్రీలో ఓ ముఠా ఏర్పడింది: ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్
దిశ, సినిమా: ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ సదీప్తో సేన్ చిత్ర పరిశ్రమ కల్చర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. లవ్ జిహాద్ నేపథ్యంలో ఇటీవల ఆయన తెరకెక్కించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే తమ చిత్రంపై వచ్చిన విమర్శలను ఉద్దేశిస్తూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. తమను ఏదో రకంగా శిక్షించేందుకు సినిమా ఇండస్ట్రీలోనే ఒక వర్గం ముఠాగా తయారైనట్లు కనిపిస్తోందని ఆరోపణలు చేశాడు. ‘‘ది కేరళ స్టోరీ’ ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అయితే దీనికోసం ప్రధాన ప్లాట్ ఫామ్ ఒప్పందం కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటివరకు మాకు ఎలాంటి ఆఫర్ రాలేదు. కానీ, మాపై విష ప్రచారం జరుగుతోంది. మా బాక్సాఫీస్ విజయం సినిమా పరిశ్రమలోని అనేక వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇండస్ట్రీలో ఒక వర్గం మమ్మల్ని నేరస్తులుగా చూపడానికి గ్రూపులు కడుతోంది’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడాడు.