వామ్మో.. అంత ఘోరమా?

by  |
వామ్మో.. అంత ఘోరమా?
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు దాటుతున్న ఓ మహిళను బైక్‌తో ఢీకొట్టి సుమార్ 50 అడుగుల దూరం వరకు ఈడ్చుకెళ్లిన ఘటన అహ్మదాబాద్‌లోని ప్రహ్మాద్ నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంజన్ షా(35) అనే మహిళ ప్రహ్మాద్ నగర్‌లో రోడ్డు దాటుతుండగా వేగంగా ఓ వ్యక్తి తన బైక్‌తో ఢీకొట్టి సుమారు 50 అడుగల వరకు ఈడ్చుకెళ్లాడు. ఆ మహిళ పైనుంచే బైక్‌ను తీసుకెళ్లాడు. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై బాధితురాలు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఘటన జరిగిన చోట సీసీటీవీ పుటేజ్ లను పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు లభ్యమయ్యాయి. దీంతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మహిళను తీవ్రంగా గాయపరిచిన వ్యక్తి కోసం పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

tags : accident, CCTV, AHmedabad, lady, prahladnagar


Next Story

Most Viewed