కేసీఆర్‌పై మోత్కుపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు.. అలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు

by  |
కేసీఆర్‌పై మోత్కుపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు.. అలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తన రాజకీయ అనుభవంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ, కేసీఆర్​ లాంటి వ్యక్తిని ఎన్నడూ చూడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీఆర్​ఎస్​పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయన సోమవారం ట్యాంక్​ బండ్‌ లోని అంబేద్కర్​ విగ్రహానికి , గన్​ పార్క్​ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తన జీవితంలో ఈ రోజు సంతోషకరమైనదిగా పేర్కొన్నారు. ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నందుకే టీఆర్ఎస్​ పార్టీలో చేరుతున్నానని క్లారిటీ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా పేదరికాన్ని రూపుమాపేందుకు దళిత బంధు వంటి స్కీంను అమలు చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్​ అని వ్యాఖ్యానించారు. రైతులు, పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్​ఎస్​ నాయకులు పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story

Most Viewed