- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో : తన రాజకీయ అనుభవంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ, కేసీఆర్ లాంటి వ్యక్తిని ఎన్నడూ చూడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయన సోమవారం ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి , గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తన జీవితంలో ఈ రోజు సంతోషకరమైనదిగా పేర్కొన్నారు. ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నందుకే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని క్లారిటీ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా పేదరికాన్ని రూపుమాపేందుకు దళిత బంధు వంటి స్కీంను అమలు చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. రైతులు, పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు.