- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సెంట్రల్ డెస్క్: ఆటోమొబైల్ విడిభాగాల దిగ్గజ కంపెనీ మదర్సన్ సిస్టమ్స్ లిమిటెడ్ 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ. 135.66 కోట్ల నికర లాభాలను వెల్లడించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈసారి 68.4 శాతం క్షీణించినట్టు కంపెనీ ప్రకటించింది. కార్యకలాపాల ఆదాయం రూ. 15,159.05 కోట్లకు తగ్గింది. అంతకుముందు ఏడాది ఇది రూ .17,169.47 కోట్లుగా ఉంది. ఇక, మొత్తం ఆర్థిక సంవత్సరం నికర లాభం రూ. 1,294.44 కోట్లను నమోదు చేసింది. ఆదాయం రూ. 63,536.87 కోట్లుగా నమోదైంది. ఇది 2018-19లో 63,522.88 కోట్ల రూపాయలుగా ఉందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా సరఫరా ఆగిపోవడం, అమ్మకాలు క్షీణించడం, చైనా, యూరప్ దేశాల్లో ప్లాంట్ల మూసివేత వల్ల కంపెనీ పనితీరు క్షీణించినట్టు, అయినప్పటికీ ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ ఆదాయాన్ని స్థిరంగా నమోదు చేయగలిగామని కంపెనీ వివరించింది. వినియోగదారుల నుంచి అత్యధికంగా ఆర్డర్లు వచ్చాయని, తమపై ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని మదర్సన్ సుమి ఛైర్మన్ వివేక్ చంద్ వెల్లడించారు.