‘అమ్మ’తనానికే మాయని మచ్చ ఈ ఘటన.. ప్రియుడితో కూతురిని ‘రేప్’ చేయించిన తల్లి..!

by  |
crime news
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత సమాజంలో మానవతా విలువలు మంట గలిసిపోతున్నాయి. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏకంగా వావి వరుసలు మర్చి ప్రవర్తిస్తున్నారు. కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లిదండ్రులే కొన్ని సార్లు తమ పిల్లలపై కర్కశత్వానికి పాల్పడుతున్నారు. కొందరు తండ్రులు ఈ మధ్యకాలంలో తమ బిడ్డలపై లైంగిక దాడులకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి రాగా, తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం అమ్మ తనానికే మాయని మచ్చగా నిలిచిపోనుంది. ఓ మహిళ భర్తను వదిలేసి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా అతనితో తన కూతురిని అత్యాచారం చేయించిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన మహరాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శనివారం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ఔరంగాబాద్‌లో నివాసముంటున్న 40 ఏళ్ల మహిళ తన భర్తకు దూరంగా ఉంటూ 52 ఏళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే, 17 ఏళ్ల కూతురు కూడా తల్లితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలోనే తల్లి తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సమయంలో ఆ వ్యక్తి మైనర్ బాలికపై కన్నేశాడు. ఈ విషయాన్ని తన ప్రియురాలికి చెప్పడంతో ఆమె కూడా అతనికే సపోర్టు చేసింది. కన్న కూతురు అనే కనికరం లేకుండా తన స్వార్థాన్ని చూసుకుంది ఆ తల్లి.. దీంతో ఆ వ్యక్తి బలవంతంగా బాలికపై రెండు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

వీరి నుంచి తప్పించుకోవాలని బాధితురాలు ప్రయత్నించగా, కసాయి తల్లి కూడా తన ప్రియుడు చెప్పినట్టు వినాలని కూతురిని బెదిరింపులకు గురిచేసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు కూతురికి రహస్యంగా పెళ్లి కూడా చేయాలని యత్నించింది. అయితే, ఈ క్రూరుల నుంచి ఎలాగోలా బయట పడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించగా ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాలికకు ట్రీట్మెంట్ ఇప్పించి వసతి గృహానికి పంపించిన ట్టు తెలుస్తోంది.


Read More 2023 Telangana Legislative Assembly election News
For Latest Government Job Notifications
Follow us on Google News




Next Story

Most Viewed