ప్రియుడితో కలిసి కొడుకును చంపిన కన్నతల్లి

by  |
ప్రియుడితో కలిసి కొడుకును చంపిన కన్నతల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి కొడుకును ఓ తల్లి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండలం మిట్స్ కాలేజీ దగ్గర పడేసి వెళ్లిపోయింది. ఇదేక్రమంలో మూడ్రోజులకు మరో బాలుడికి వాతలు పెడుతూ చిత్రహింసలు పెడుతుండగా స్థానికులు ప్రశ్నించారు. దీంతో ఆ బాలుడు విషయం మొత్తం చెప్పాడు. అన్నయ్యను చంపి మిట్స్ కాలేజీ దగ్గర పడేసి వచ్చిందని చెప్పడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ఉష, శ్రీనును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. నిజం ఒప్పుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.


Next Story

Most Viewed