పిల్లలను చంపి ఉరేసుకున్న తల్లి.. అసలేం జరిగిందంటే ?

by  |
children
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన పిల్లలిద్దర్నీ చంపి..ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం పిడుగురాళ్ల పట్నంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బండారి శ్రావణ్ కుమార్, మానసలకు ఏడేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి షర్మిల(3), జ్యోతి(2)లు సంతానం. అయితే దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో శనివారం రాత్రి కూడా భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అయితే భోజనం చేసిన తర్వాత కూడా భార్య భర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో కోపంగా తన ఇద్దరు పిల్లలను తీసుకుని మానస వేరే గదిలోకి వెళ్లిపోయింది. ఆ గదిలో నిద్రపోతుందేమోనని భావించిన భర్త శ్రావణ్ కుమార్ వేరే గదిలో నిద్రపోయాడు.

mother

తమ సంసారం నిత్యం గొడవలు నెలకొనడంతో మాన తన పిల్లలిద్దరి గొంతుకు చున్నీ బిగించి హత్య చేసింది. ఆ తర్వాత మానస కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తెల్లవారు జామున భర్త శ్రావణ్ కుమార్ తలుపుకొట్టగా ఎంతసేపటికీ తలుపు తియ్యలేదు. దీంతో భర్త తలుపులు పగలగొట్టి చూడగా ముగ్గురు విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో శ్రావణ్ కుమార్ స్థానికులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త శ్రావణ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే మానన ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మెుత్తానికి ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.



Next Story

Most Viewed