- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముధోల్: భైంసా ఏరియా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. కుబీర్ మండలం బెల్గాంతండా(2)కి చెందిన రేష్మాబాయ్(24) పురిటి నొప్పులతో ఆదివారం రాత్రి సమయంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలోనే నార్మల్ డెలివరీ అయింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, సరైన సమయానికి చికిత్స లభించక ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన కుటుంబీకులు సూపరింటెండెంట్, వైద్య సిబ్బంది తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భైంసా ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తూ.. మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story