మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. వైద్యుల నిర్లక్ష్యంతో..!

by  |
మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. వైద్యుల నిర్లక్ష్యంతో..!
X

దిశ, ముధోల్: భైంసా ఏరియా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. కుబీర్ మండలం బెల్గాంతండా(2)కి చెందిన రేష్మాబాయ్(24) పురిటి నొప్పులతో ఆదివారం రాత్రి సమయంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలోనే నార్మల్ డెలివరీ అయింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, సరైన సమయానికి చికిత్స లభించక ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన కుటుంబీకులు సూపరింటెండెంట్, వైద్య సిబ్బంది తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భైంసా ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తూ.. మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.


Next Story