ప్యాకెట్ పాల ధర భారీగా పెంపు.. రేపటి నుంచే కొత్త ధర..

by  |
Mother-Dairy
X

దిశ, వెబ్‌డెస్క్ : వినియోగదారులకు భారీ షాక్. మరోసారి పాల ధర భారీగా పెరిగింది. మదర్ డెయిరీ పాల ధరలు ఆదివారం నుంచి పెరగునున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ నగరంలో మదర్ డెయిరీ లీటరు పాలపై 2 రూపాయలు చొప్పున పెంచుతూ శనివారం నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా పాల సేకరణ, ప్రాసెస్, ప్యాకేజింగ్, రవాణ ఖర్చులు పెరగడంతో పాల ధరలను పెంచుతున్నట్టు మదర్ డెయిరీ ప్రకటించింది. ఏడాది కాలంగా రైతుల నుంచి పాల సేకరణ ధర పెరిగినా వినియోగదారులపై భారం మోపలేదని డెయిరీ తెలిపింది. అయితే, పెరిగిన పాల ధరలు అన్ని రకాలకూ వర్తిస్తుందని మదర్ డెయిరీ ప్రకటించింది. మదర్ డెయిరీ 2019 డిసెంబరులో పాల ధరలు పెంచింది. మళ్లీ ఈ ఏడాది పాల ధరలను పెంచుతున్నట్టు పేర్కొంది.



Next Story

Most Viewed