చాంద్రాయణగుట్టలో తల్లీ-కొడుకుల మిస్సింగ్ కలకలం

by  |
చాంద్రాయణగుట్టలో తల్లీ-కొడుకుల మిస్సింగ్ కలకలం
X

దిశ, చార్మినార్: అనుమానాస్పద స్థితిలో తల్లీ, కొడుకులు అదృశ్యమైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్​పరిధిలో జరిగింది. చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్మాయిల్‌నగర్‌కు చెందిన ముంతాజ్ బేగం, అల్లాబక్ష్‌లు దంపతులు. దీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. చిన్న కుమార్తె ఇష్రత్​ బేగం(28), ఆమె కుమారుడు ఫర్హాన్​(10)లు గత కొంత కాలంగా తల్లి దండ్రుల వద్దనే ఉంటున్నారు. ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 1గంటలకు కూతురు ఇష్రత్, మనువడు ఫర్హాన్‌లు కనిపించలేదు. వారి ఆచూకీ కోసం చుట్టుపక్కల బంధువుల ఇళ్ళలో వెతికినప్పటికీ ప్రయోజనం కనిపించకపోవడంతో ముంతాజ్​ బేగం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed