చెరువులో తల్లీకూతుళ్ల శవాలు.. చనిపోయారా..? చంపేశారా..?

by  |
చెరువులో తల్లీకూతుళ్ల శవాలు.. చనిపోయారా..? చంపేశారా..?
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో విషాదం చోటుచేసుకొంది. తిమ్మారెడ్డిపల్లి చెరువులో శనివారం ఉదయం తల్లీ కూతుళ్ళ మృతదేహాలను గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దామరగిద్ద మండలం వత్తు గుండ్ల తండాకు చెందిన రజిత(25), సంవత్సరం వయసున్న కూతురుతో కలిసి ఈ నెల 23న నారాయణపేటకు చేరింది. ఈ క్రమంలో ఆ రోజు సాయంత్రం వరకు తల్లీకూతుళ్ల ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నారాయణపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని తల్లీ కూతుళ్ళ ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే శనివారం ఉదయం చెరువులో తల్లీకూతుళ్లు శవాలుగా కనిపించడం సంచలనంగా మారింది. ఆ మృతదేహాలు నారాయణపేట లో తప్పిపోయిన రజిత, ఆమె కూతురు శ్రీలతవిగా గుర్తించారు. ఈ మేరకు ఉట్కూరు ఎస్ఐ రషీద్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇవి ఆత్మహత్యలా..? లేదా ఎవరైనా హత్య చేసి చెరువులో పారేశారా..? తల్లీకూతుళ్ల మృతికి గల కారణాలు ఏమిటి అన్న విషయాలతో పాటు వివరాలు సేకరిస్తున్నారు.


Next Story

Most Viewed