బిల్డింగ్ పై నుంచి దూకి.. తల్లీబిడ్డ ఆత్మహత్య..

by  |
బిల్డింగ్ పై నుంచి దూకి.. తల్లీబిడ్డ ఆత్మహత్య..
X

దిశ,వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. భర్తతో గొడవ పెట్టుకుని క్షణికావేశంలో ఓ ఇల్లాలు తన ఏడాది కూతురితో కలిసి నాలుగంతస్థుల బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తల్లీకూతుర్లు అక్కడికక్కడే మరణించారు.

ఈ ఘటన నగరంలోని ఉప్పల్ రామాంతాపూర్‌లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed