కొడుకు కానరాడని..?

by  |
కొడుకు కానరాడని..?
X

దిశ, వెబ్‌డెస్క్: చనిపోయిన కొడుకు ఇక రాడని తల్లి తల్లడిల్లిపోయింది. కడుపు కోతతో గుండెపోటు తెచ్చుకుంది. చివరకు కొడుకువద్దకే తాను వెళ్లిపోయింది. కనరాని లోకాల్లో కలిసిపోయింది. పాడెక్కిన చిన్న తమ్ముడిని చూస్తూ అన్నల ఆర్థనాదాలకు తోడు అమ్మ కూడా అసువులు బాయడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఏపీలో జరిగిన ఈ విషాద ఘటన అందరి గుండెల్ని పిండేసింది.

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో ట్రాక్టర్ దిగబడిందని.. దానిని మరో ట్రాక్టర్‌తో వెలికి తీసేందుకు సుబ్బారావు(30) వెళ్లాడు. ఇదే సమయంలో ఒక్క సారిగా ట్రాక్టర్ తిరగబడింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయా పాలు అయిన సుబ్బారావు అక్కడి కక్కడే మృతి చెందాడు.

అప్పటికే, తల్లికి జరిగిన విషయం చెప్పని కుటుంబీకులు నేరుగా మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కొడుకు మరణవార్త విన్న తల్లి రాగమ్మ(60) చివరి చూపు కోసం ఎదురు చూసిందో ఏమో.. గానీ, రక్తంతో తడిసిన కొడుకును చూసి అక్కడే కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచింది. ఒకే రోజులో ఒకే సారి ఆ కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా, రాగమ్మకు ముగ్గురు కొడుకుల్లో సుబ్బారావు చిన్న కొడుకని తెలుస్తోంది. అయితే, సుబ్బారావు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Next Story

Most Viewed